మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నిన్న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కొలువు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు.
ఈ క్రమంలో కొంత తోపులాట అభిమానుల మధ్య జరిగడంతో షర్మిల స్పృహ తప్పి పడిపోయారు.ఇదే సమయంలో షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పృహలోకి వచ్చాక బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించిన సంగతి తెలిసిందే.
కాగా దీక్ష సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ మండిపడుతు, షర్మిల శాంతియుతంగా దీక్ష చేస్తుంటే, పోలీసులు దౌర్జన్యం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.శాంతియుతంగా నిరసన చేపడితే, ఈ దాష్టీకాలు ఏంటని ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని గుర్తుంచుకోవాలని, పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తే, రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతాయని పేర్కొన్నారు.