తెలంగాణ రాష్ట్రంలో మహమ్మారి కరోనా కారణంగా చాలా కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.ముఖ్యంగా కుటుంబ పెద్దదిక్కును అనగా యజమానులను కోల్పోయి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఇలాంటి తరుణంలో ఓ ప్రముఖ వార్తా పత్రిక “కూలుతున్న కుటుంబాలు” అనే వార్త కథనాన్ని వైయస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేసి .కుటుంబ యజమాని కోల్పోయిన మహిళలకు అండగా ఉంటాం అంటూ సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.
‘తెలంగాణ ఆడబిడ్డలారా… దైర్యం కోల్పోకండి.కుటుంబ పెద్ద దిక్కు తండ్రి/భర్త /కొడుకును కరోనా వల్ల కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల బాధను కాస్తైనా పంచుకోవడానికి నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను.
మా ఫోన్ నంబరు: 040-48213268‘ అని షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.మరోపక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ షర్మిల క్యాడర్ మరియు వైయస్ కుటుంబాన్ని ప్రేమించే అభిమానులు అనేక రీతులుగా సహాయాన్ని అందిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో షర్మిల… కుటుంబ యజమాని కోల్పోయి .కుమిలిపోతున్న తెలంగాణ స్త్రీజాతికి తాను అండగా ఉంటాను అంటూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.