తెలంగాణ రాజకీయాలలో షర్మిల పొలిటికల్ ఎంట్రీ గత కొద్ది నెలల నుండి వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే.మొదటిగా జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనం పేరిట వైఎస్ అభిమానులతో ఆత్మీయులతో సమావేశమై ప్రజా సమస్యల గురించి వారి అభిప్రాయాలు గురించి తెలుసుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే షర్మిల నిన్న ఖమ్మం జిల్లాలో సంకల్ప సభ పేరిట తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జూలై 8 వ తారీకు తన తండ్రి జయంతి నాడు పార్టీ విధి విధానాలు పేరు మరియు జెండా, అజెండా ప్రకటిస్తామని స్పష్టం చేయడం జరిగింది.
దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల ప్రకటనతో ఫుల్ జోష్ లో ఉన్నారు వైఎస్ అభిమానులు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 15వ తారీకు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల దీక్ష చేయడానికి రెడీ అవుతున్నట్లు షర్మిల ప్రకటించారు.తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్ల నిమిత్తం మూడు రోజులపాటు దీక్ష చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగిపోవటానికి ఈ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
హైదరాబాద్ నడిబొడ్డులో మూడు రోజులపాటు తాను నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని నాలుగో రోజు నుంచి ప్రతి జిల్లాలో కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేస్తారు నోటిఫికేషన్ వచ్చే వరకు ఏ రిలే నిరాహార దీక్షలు ఆగవు అంటూ షర్మిల స్పష్టత ఇచ్చారు.ఈ క్రమంలో రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని తాము అండగా ఉంటామని షర్మిల పేర్కొన్నారు.
.