తెలంగాణ రాజకీయాలలో బాణం లా దూసుకుపోతున్న వైయస్ షర్మిల. తాజాగా నల్గొండ జిల్లాలో పర్యటించారు.
కరోనా కారణంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వైఎస్ అభిమాని సలీం మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని వైయస్ షర్మిల భరోసా ఇచ్చారు.ఇదే క్రమంలో సూర్యాపేట జిల్లా మేడారం ప్రాంతంలో కూడా షర్మిల పర్యటించారు.
నీలకంఠ సాయి అనే వ్యక్తి ఉద్యోగం రాక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతని పరామర్శించడానికి వైఎస్ షర్మిల అతని ఇంటికి వెళ్లగా అతడు ఆ టైంలో ఇంట్లో లేకపోవటం వైయస్ షర్మిల టీంకి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది.ఈ రీతిగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉంటూ మరోపక్క వైయస్ అభిమానించే వారికి అండగా నిలబడుతూ షర్మిల సరికొత్త రాజకీయ అడుగులు వేస్తోంది.
వైయస్ జయంతి నాడు అనగా జూలై 8 వ తారీకు.వైయస్సార్ టీపీ.అనే కొత్త పార్టీ ప్రకటించడానికి.ప్రస్తుతం వైఎస్ఆర్ షర్మిల టీం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది.