తెలంగాణ రాజకీయాలలో వైయస్సార్ టీపీ పార్టీ పేరుతో అడుగుపట్టిన విషయం తెలిసిందే.అయితే పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసిన తరువాత ఇందిరా పార్క్ లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ లు విడుదల చేయాలని నిరసిస్తూ 72 గంటల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే 24 గంటల దీక్ష తరువాత పోలీసులు దీక్షను భగ్నం చేయడంతో లోటస్ పౌండ్ లోని తన నివాసంలో దీక్షను కొనసాగించిన విషయం తెలిసిందే.అయితే ఇటీవల వైయస్సార్ టీపీ పార్టీని ప్రారంభించిన షర్మిల కెసీఆర్ పై, జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
అయితే ఇక ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేపట్ట బోతున్నట్టు షర్మిల పార్టీ వర్గాలు తెలిపాయి.అయితే ఇక దశల వారీగా రకరకాల సమస్యలపై దీక్షల పేరుతో తమ నిరసనలను తెలపనున్నట్లు తెలుస్తోంది.
అయితే షర్మిల పార్టీకి ఇప్పట్లో అంతగా మద్దతు లేకున్నా మీడియా హైప్ తో మిగతా పార్టీలకు కొంత మేర నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.అయితే షర్మిల ఇక రాను రాను తెలంగాణలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.
మరి తెలంగాణ రాజకీయాలలో షర్మిల ఎంత మేర సత్తా చాటుతుందో చూడాల్సి ఉంది.