నేనున్నానని నిరూపించుకునేందుకే షర్మిల ఇలా చేస్తోందా?

తెలంగాణలో వై.ఎస్.

 Ys Sharmila Letter To Governor Tamili Sai Over Corona Treatment, Aarogyasri, Cor-TeluguStop.com

షర్మిల పరిస్థితి అనుకున్నదొక్కటి… అయినదొక్కటి అన్న చందంగా మారింది.రాజన్న రాజ్యం పేరుతో తెలంగాణలో ఏదో అలజడి సృష్టించాలని ప్రయత్నించిన షర్మిలకు ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితులు బోధ పడుతున్నట్టు తెలుస్తోంది.

అసలు దీక్ష చేపట్టినా ఎవరి నుండి కదలిక లేదు, తోటి ప్రతిపక్ష పార్టీల మద్దతు దొరుకుతుందా అంటే వారి మద్దతు దొరకలేదు.నిరాహార దీక్షను నిరుద్యోగులు నమ్మలేదు.

ఇక ఎన్ని చేసినా ఇక్కడ ఒంటరి పోరాటం తప్పదని షర్మిల ప్రగాఢంగా భావిస్తోంది.ఎందుకంటే షర్మిల పార్టీకి ఏ పార్టీ మద్దతు ఇచ్చినా ఆ పార్టీ ఇక తెలంగాణలో భూ స్థాపితం అవడం ఖాయం.

ఎందుకంటే కేసీఆర్ కు తమంతట తాముగా అస్త్రాన్ని ఇచ్చినట్టు అవుతుంది.అయితే తాజాగా వై.ఎస్.షర్మిల కరోనాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా పేరిట నిరుపేదలను దోచుకుంటున్నాయని, తక్షణమే కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని వై.ఎస్.షర్మిల గవర్నర్ తమిళిసై కి లేఖ రాసింది.ఎందుకంటే ఈ కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలనే అంశంపై ఇప్పుడు అన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.ఇక స్పందించకుంటే మరల టార్గెట్ అయ్యే అవకాశం ఉందని భావించిన షర్మిల గవర్నర్ కు లేఖ రాసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube