వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.మెదక్ జిల్లా నర్సాపూర్ లో మాట్లాడుతూ 30 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సేవ చేశారని తెలిపారు.
కానీ వైఎస్ చనిపోతే ఎలా చనిపోయారో కూడా కాంగ్రెస్ విచారణ జరపలేదని మండిపడ్డారు.బతికి ఉన్నప్పుడు ఇంద్రుడు, చంద్రుడు అనే పొగిడారు.
చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చారని విమర్శించారు.వైఎస్ఆర్ కు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ నేనని ఆరోపించారు.
వై ఎస్ ఫోటో పెట్టుకుని ఓట్లు అడగటానికి సిగ్గు ఉండాలని ఎద్దేవా చేశారు.వైయస్ బతికుంటే కాంగ్రెస్ పై ఉమ్మేసేవారని షర్మిల వ్యాఖ్యానించారు.