టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు.. ?

తెలంగాణాలో మరో కొత్త పార్టీ అవిర్బవించబోతుందన్న విషయం ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్ధం అయినట్లుగా ఉంది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురూ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ వేదికగా తన కొత్త పార్టీకి పావులు కదుపుతున్నారు.

 Hyderabad, Lotus Pond, Karimnagar, Ys Sharmila, Allegations, Trs Government-TeluguStop.com

ఈ క్రమంలో వైఎస్ అభిమానులతో ఆత్మీయసమ్మేళనం వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.తన తండ్రి వైయస్‌ఆర్‌కు దగ్గరగా ఉన్న నేతలను, మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లతో మంతనాలు చేస్తున్నారు.

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఓ నివేదిక కూడా తయారు చేయించుకుంటున్నదట షర్మిల.

ఇక తెలంగాణలో తన పార్టీ బలోపేతంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు నిరంకుశ పాలన అందిస్తుందని, ఇందుకు నిదర్శనంగా నేరేళ్లకు చెందిన బాధితులే సాక్ష్యమని తీవ్రంగా విమర్శించారు.

ఇక రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులు ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.

ఇక ఈ రోజు హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు, వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తెలంగాణ గడ్డను పొగుడుతూ ఇలా పలు విమర్శలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube