హుజరాబాద్ ఉప ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే.ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ అన్ని విధాల రెడీ అవుతుంది.
ఈ క్రమంలో అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని కూడా ఖరారు చేయడం జరిగింది.దీంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తో పాటు మంత్రి హరీష్ రావు కూడా నియోజకవర్గంలో టిఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు.
మరోపక్క బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయటానికి రెడీ అవుతూ ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర కూడా స్టార్ట్ చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా హుజురాబాద్ ఉప ఎన్నికల పై తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఎన్నికలలో నిరుద్యోగులు పోటీ చేయాలని షర్మిల వ్యాఖ్యానించారు.నిరుద్యోగులు తరఫున పోరాటం మరింత చేస్తామని రాష్ట్రంలో వందల సంఖ్యలో నిరుద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి గట్టిగా బుద్ధి చెప్పాలంటే హుజరాబాద్ ఉప ఎన్నికలలో నిరుద్యోగులు వందల సంఖ్యలో నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు.