తెలంగాణలో ఉన్న వైఎస్ అభిమానులకు శుభవార్త అంటూ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల.ఇందులో భాగంగా ఇది వరకే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న వైఎస్ అభిమానులతో సమావేశం అయిన విషయం తెలిసిందే.
తెలంగాణాలో పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలన్న దానిపై అభిమానుల అభిప్రాయాలు తీసుకున్న షర్మిల, తర్వాత ఈ నెల 21 వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు.
అంతేకాదు భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తారని ప్రకటించారు కూడా.
కానీ ఉన్నట్టుండి వైఎస్ షర్మిల తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.దీనికి కారణం తెలంగాణలో రెండు ఎమ్మల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవడమేనట.
ఇకపోతే హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో పట్టాభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో హడావుడి నెలకొంటుందని ఆలోచించిన షర్మిళ తన ఖమ్మం టూర్ను వాయిదా వేసుకున్నారని సమాచారమట.