నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నేపథ్యంలో YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల.
ట్యాంక్ బండ్ వద్ద నివాళి అర్పించడం జరిగింది.ఈ క్రమంలో చివరి శ్వాస వరకు సమాన హక్కులు మరియు సమ న్యాయం కోసం.
అంబేద్కర్ గారి స్ఫూర్తితో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పనిచేస్తుంది.జై భీమ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ .వైయస్ షర్మిలకు ఫోన్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.విషయంలోకి వెళ్తే ఇటీవల ఆమె చేస్తున్న పాదయాత్రలో టిఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో ఆమె నిరసనకు దిగారు.దాడిలో షర్మిలకి గాయం కూడా అవటం జరిగింది.
ఈ క్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడి ఘటనలో తన కారు ధ్వంసం కావటంతో … ఆ వాహనాన్ని కేసీఆర్ కి చూపించడానికి నిరసన వ్యక్తం చేయడానికి ప్రగతి భవన్ బయలుదేరారు.ఆ సమయంలో పోలీసులు అడ్డుకుని ఆమె కారులో ఉండగానే క్రేన్ సాయం ద్వారా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం తెలిసిందే.
అయితే ఈ ఘటనపై షర్మిల కి ప్రధాని మోడీ ఫోన్ చేసి పరామర్శించడం జరిగిందట.ధైర్యంగా ఉండాలని సూచించడం మాత్రమే కాదు త్వరలో ఢిల్లీకి రావాలని షర్మిలకి మోడీ తెలియజేసినట్లు తెలుగు రాజకీయాల్లో వార్తలు కలకలం రేపుతున్నాయి.