దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనయురాలిగా.తెలంగాణ కోడలిగా తెలంగాణ రాజకీయాలలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల పట్ల ప్రకటించడం తెలిసిందే.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో సమావేశమై కొత్తపార్టీ వస్తే ఏంటి అనే దానిపై వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.మార్చి నెల నుండి వైయస్సార్ ఆత్మీయ సమ్మేళనం అనే పేరిట షర్మిల కార్యక్రమం నిర్వహించి చాలా మందితో ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది.
ఆ తర్వాత పార్టీ పేరు భారీ బహిరంగ సభలో ప్రకటించాలని ప్లాన్ చేసిన షర్మిల టీంకి కరోనా అడ్డురావడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో మధ్యలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ కుటుంబాలను పరామర్శిస్తు వారికి భరోసా ఇస్తూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో కీలక అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరును దరఖాస్తు చేసుకోగా తాజాగా ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
ఎన్నికల సంఘం ఈ పార్టీ పేరును గుర్తిస్తూ రిజిస్టర్ చేసింది.తాజాగా ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పార్టీ పేరు ఖరారు కావడంతో ఇప్పటికే నిరుద్యోగులు తరఫున దీక్ష చేసిన షర్మిల రాబోయే రోజుల్లో ఏ తరహాలో కార్యక్రమం చేపడుతోంది అన్నది హాట్ టాపిక్ అయింది.
.