వైసీపీ తరుపున అధినేత జగన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత సభలు నిర్వహిస్తూ, అధికార పార్టీపై పైచేయి సాధించి ఎన్నికల రంగంలో ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా టార్గెట్ చేసి తమకి ప్రమాదంగా ఉన్న అతనిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ విధంగా ఈ ఎన్నికల ప్రచారం ఎలా ఉన్న జనం నాడి ఇప్పుడు వైసీపీ వైపు ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.ఇక నాయకులు కూడా వైసీపీ గెలుపుపై ధీమాతోనే ఆ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు అని కూడా టాక్ వినిపిస్తుంది.అయితే జగన్ విజయాన్ని అడ్డుకోవాలని జనసేనాని ప్రయత్నాలు విస్తృతంగా చేస్తున్నారు.
ఇక టీడీపీ అయితే, కెఎ పాల్ తో జగన్ ని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో ముందుకి వచ్చిన షర్మిల మీడియా సమావేశం ద్వారా టీడీపీ, జనసేన పార్టీలని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేసారు.రెండు పార్టీలు ప్రజలని మోసం చేస్తున్నాయని, రహస్య ఒప్పందంతో వైసీపీని దెబ్బ తీయాలని చూస్తున్నాయని అన్న మాటనే మళ్ళీ చెప్పింది.
ఇక ఎన్నికల ప్రచారం పర్వంలోకి అడుగుపెట్టిన షర్మిల ఈ రోజు మంగళగిరిని ప్రచారం మొదలుపెట్టబోతుంది.
ఈ ప్రచారంలో ఆమె ప్రధానంగా నారా లోకేష్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.మంగళగిరిలో గెలిచి తన మీద ఉన్న మచ్చని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి తనయుడుకి వైసీపీ అభ్యర్ధి నుంచి, మరో వైపు జనసేన నుంచి గట్టి పోటీ ఉంది.ఇలాంటి టైంలో షర్మిల ప్రచారంలో లోకేష్ పై ఎలాంటి విమర్శలు చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.