ఢిల్లీలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటన కొనసాగుతోంది.దీనిలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్ ను ఆమె కలవనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు చేయనున్నారు.అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు షర్మిల మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం.