వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు.గతంలో ఆమెకు .
సినీ హీరో ప్రభాస్ కు మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ … అనేక పుకారాలు వచ్చిన నేపథ్యంలో అది కాస్తా… రాజకీయ రంగు పులుముకుంది.ఆ దుమారం జరిగి చాలా కాలమే అయ్యింది .ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో… ఈ వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.తాజాగా… సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ… హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్కు ఏపీ షర్మిల దంపతులు ఫిర్యాదు చేశారు.తమపైనా, తమ కుటుంబసభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘నాకూ, ప్రభాస్కు సంబంధం ఉందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు.నా జీవితంలో ప్రభాస్ను ఎప్పుడూ కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు.2014 ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారాలే చేశారు.అప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడంతో కొంతకాలం ఆగింది.ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఈ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు.దీని వెనుక టీడీపీ హస్తం ఉంది’ అని షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు.