ప్రత్యామ్నాయ పంటలు వేయమంటే సరిపోతుందా.మరి వారి పరిస్థితేంటి.
కేసీఆర్ను నిలదీసిన షర్మిల రైతుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రైతుల కష్టాలు కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు.రైతుల కష్టాలు కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు.కొందరు రైతులకు పంట బీమా కూడ అందని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు
.