జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త ప్రోగ్రాం కి కంకణం కట్టుకున్నారు.తన తండ్రి జయంతి రోజున ఈ కొత్త కార్యక్రమం ” గడప గడపకూ ” మొదలు పెట్టి డిసెంబర్ 31 వరకూ కూడా అన్ని ప్రాంతాలూ తిరగాలి అని అనుకుంటున్నారు.
చంద్రబాబు సర్కారు చేస్తున్న అవినీతి మీద , వారు ఫెయిల్ అయిన తీరు మీదా మాట్లాదదలచుకున్న జగన్ చాలా ప్రాంతాలు కవర్ చేస్తారు.
ప్రతీ నియోజికవర్గం లో దాదాపు యాభై వేల కుటుంబాలని కలసుకోవాలి అనేది ఆయన టార్గెట్.
ఐదు నెలల కాలం లో ప్రతీ కుటుంబాన్నీ ఆయా గ్రామ – మండల – నియోజికవర్గ స్థాయి నాయకులతో కలిసి లోకల్ ప్రజలని కలవాలని ఆయన చూస్తున్నారు.
ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా ఆందోళనలు చేపట్టారు.
రైతుల కోసం – విద్యార్దుల కోసం యువభేరిలు నిర్వహించారు.పలు సందర్భాలలో నిరాహారదీక్ష లు చేపట్టారు.
ప్రత్యేక హోదా కోసం కూడా నిరసన దీక్షకు దిగారు.
ఈ కార్యక్రమాలన్ని పార్టీ పరంగా విజయవంతం అయినప్పటికి ప్రజలలో అనుకున్నంతగా స్పందనలు రాబట్టలేకపోయాయి.
ప్రత్యేక హోదా కోసం ప్రతి పక్షనేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపడు తుంటే.ఆ పార్టీ ఎంఎల్ ఏలు – ఎంపిలు – నియోజకవర్గ ఇన్ చార్జీలు దీక్షా శిభిరం చుట్టు ప్రదక్షణలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ మద్దతు ప్రకటించారు తప్ప.ప్రత్యేక హోదా డిమాండ్ కు ఉన్న ప్రాధాన్యతను తమ నాయకుడు దీక్ష పట్టుదలను ఆపార్టీ నాయకులే సిరియస్ గా తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
చూద్దాం ఇది ఏమవుతుందో.