రెండో రోజు కూడా ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వైయస్ జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం జరిగింది.ఈ భేటీలో పోలవరం నిధులకు సంబంధించి ప్రధాన చర్చ జరిగినట్లు ఏపీ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి.

 Ys Jagan With Union Ministers In Delhi For The Second Day Too, Ys Jagan, Amith S-TeluguStop.com

అంతేకాకుండా పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలని, దిశా బిల్లు, కర్నూలు హైకోర్టు విషయంతోపాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను వివరించినట్లు సమాచారం.

దాదాపు ఇద్దరి మధ్య గంట సేపు భేటీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలా ఉంటే రెండో రోజు కూడా పలువురు కేంద్ర మంత్రులతో వైఎస్ జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.కేంద్ర జల శక్తి మంత్రి అదేవిధంగా మరికొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.

వచ్చే ఫిబ్రవరి మాసంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో తాజాగా జగన్ ఢిల్లీ పర్యటన రాష్ట్రవ్యాప్తంగా అదే విధంగా జాతీయ పరంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube