దేశంలో ముఖ్యమంత్రుల పనితీరుపై ఏబీపీ, సీ-ఓటర్ చేసిన సర్వేలో టాప్ త్రీ సిఎంలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.టాప్ ర్యాంకింగ్స్ లో వరుసగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచారు.దాదాపు 30 వేల మంది కలసి 500కు పైగా పార్లమెంటు నియోజకవర్గాలలో జరిపిన ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు ఏమిటి.
అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కాకపోయినా గాని తల పండిపోయిన ముఖ్యమంత్రులకు పోటీగా జగన్ గత కొన్నాళ్ల నుండి వరుసగా ర్యాంకులు సాధించటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వ పథకాలు ఎక్కడ ఆగిపోకుండా మరోపక్క పేదవాళ్ల బతుకులపై విద్య అదేవిధంగా వైద్యం భారం కాకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలు.చాలా వరకు వైసిపి పార్టీకి అనుకూలంగా ఫలితాలు తేప్పిస్తున్నట్లు అందువల్లే ప్రజలంతా సంతోషంగా ఉన్నట్లు ఏబీపీ సీ-ఓటర్ చేసిన సర్వేలో జగన్ కి వచ్చిన ర్యాంకు పై చాలా మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా సీఎం స్థానంలో కూర్చున్న నాటినుండి పేరుగాంచిన మ్యాగజైన్లు ఇంకా ఏబీపీ, సీ-ఓటర్ లాంటివి చేస్తున్న సర్వేలలో మొదటినుండి టాప్ ఫైవ్ లో ఉండే రీతిలో జగన్ ర్యాంకులు సాధించడం పట్ల వైసీపీ శ్రేణులు కూడా తాజా ర్యాంకు బట్టి కాలర్ ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.