నెల్లూరులో సమర శంఖారావంతో జగన్ ఎన్నికల ప్రచారం!

ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం, పది రోజులలో వచ్చే అవకాశం వుంది.ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ ఎన్నికల ప్రణాళికని సిద్ధం చేసుకొని జిల్లాల వారీగా పార్టీ నాయకులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అభ్యర్ధులని ప్రకటిస్తున్నాడు.

 Ys Jagan Started Samara Shankaravam In Nellore-TeluguStop.com

ఇక వైసీపీ కూడా స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధుల మీద కసరత్తు చేస్తుంది.మరో వైపు మేనిఫెస్టో రూపకల్పనలో నిమగ్నమై వుంది.

ఈ నేపధ్యంలో వైసీపీ పార్టీ కూడా ఎన్నికల సమర శంఖం పూరించడానికి రెడీ అయిపొయింది.ఎన్నికల ప్రచారం విస్తృతం చేసే ఉద్దేశ్యంతో ఈ రోజు జగన్ నెల్లూరు వేదికగా సమర శంఖారావం సభతో ఎన్నికల ప్రచారానికి తెర తీస్తున్నాడు.

ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ మీద వ్యతిరేకతని తన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న జగన్ దానికి తగ్గట్లే హామీల వర్షం కురిపించాడు.ఇక మేనిఫెస్టోలో వాటిని పొందుపరచడం ద్వారా హామీలపై ప్రజలలో నమ్మకం కలిగించే ప్రయత్నం చేయడంతో పాటు, ఈ రోజు ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాడు.

మరి ఈ రోజు సభలో వైఎస్ జగన్ ప్రజల ని ఉద్దేశించి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నాడు.అలాగే అధికార పార్టీని కార్నర్ చేయడానికి ఎలాంటి వ్యూహాలని సిద్ధం చేసుకున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube