ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నామినేటెడ్ పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే.దాదాపు 50 శాతానికి పైగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరోపక్క బీసీలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది.
ఇటువంటి తరుణంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్న అడపా శేషు ఏపీ సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.పదవి దక్కిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు కాపు కార్పొరేషన్ పదవి చైర్మన్ ఇచ్చినందుకు సీఎం జగన్ కి ధన్యవాదాలు అని తెలిపారు.
కాపులకు పెద్ద పీట వేసి పదవులు అందించారని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను నాయకులను ఎప్పుడు మర్చిపోలేని నాయకుడు జగన్ అని తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యత బట్టి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేలా పని చేస్తాను అని అడపా శేషు స్పష్టం చేశారు.
అదే రీతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ .కచ్చితంగా కాపు కులానికి అండగా నిలబడతా అదేరీతిలో ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కి అధిక నిధులు కేటాయించడం నిజంగా హర్షించదగ్గ విషయం అడపా శేషు ఆనందం వ్యక్తం చేశారు.
.