విధుల్లో బిజీ గా ఉన్నందున వ్యక్తిగత హాజరు కు మినహాయింపు కోరిన ఏపీ సీఎం

ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.ఏపీ సీఎంగా అధికారిక భాద్యతలు స్వీకరించినందున ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ ఆ పిటీషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

 Ys Jagan Petition In Cbi Ap Cabinet Meetings-TeluguStop.com

ఏపీ సీఎంగా అధికారిక విధుల్లో బిజీగా ఉన్నందున ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు జగన్, తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని ఆ పిటీషన్ ద్వారా విన్నవించుకున్నారు.తాను సీఎం బాధ్యతల్లో ఉన్నందున అధికారిక వ్యవహారాల్లో పాల్గొనాలి.

ఎక్కు వ సమయం పరిపాలనకు కేటాయించాలన్న కారణంగా కోర్టుకు హాజరుకావడం ఇబ్బందిగా ఉన్నట్లు తెలిపారు.తాను తరచుగా హైదరాబాద్‌లో కోర్టు విచారణకు హాజరుకావడం వల్ల పరిపాలన దెబ్బతినే అవకాశం ఉందని అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదని కావున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆ పిటీషన్ లో కోరినట్లు తెలుస్తుంది.

Telugu Ap, Ap Cm Ys Jagan, Chandrababu, Janasena, Pawankalyan, Ys Jagan, Ysrcp-T

అయితే, తన వ్యక్తిగత హాజరు తప్పనిసరిగా అవసరమని కోర్టు భావిస్తే మాత్రం ఆదేశించినప్పుడల్లా కోర్టుకు హాజరవుతానని తన పిటీషన్ లో పేర్కొన్నారు.అయితే సీఎం జగన్ పెట్టిన ఈ పిటిషన్‌పై కాసేపట్లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది.దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube