వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ వేడుకలు నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి.ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.
సీఎం జగన్ ఇంకా వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రముఖ నాయకులు అధికారులు హాజరయ్యారు.చాలా మందికి ఈ అవార్డులను ప్రకటించారు ఈ క్రమంలో అవార్డు ప్రదానోత్సవంలో సీఎం జగన్.
చేసిన ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.విషయంలోకి వెళ్తే దళిత మేధావి కత్తి పద్మారావు కి కూడా ఈ అవార్డు లభించింది.
ఇదిలా ఉంటే కత్తి పద్మారావు లేవలేని స్థితిలో ఉండటంతో.ఆయనను వీల్ చైర్ లో కుటుంబ సభ్యులు తీసుకురావడం జరిగింది.
అలా వచ్చిన ఆయనకు సీఎం జగన్ అవార్డు అందించిన తర్వాత.మళ్లీ తిరిగి వీల్ చైర్ లో కూర్చున్నే సమయంలో ఫుట్ స్టెప్స్ పట్టేయటం తో కత్తి పద్మారావు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో వెంటనే సీఎం జగన్ ఆయన కాళ్లు పట్టుకుని.ఫుట్ స్టెప్స్ సరిచేసి కుర్చీలో కూర్చోబెట్టారు.ఒక ముఖ్యమంత్రి స్థాయి లో ఉన్న వ్యక్తి దళిత మేధావి కాళ్లు పట్టుకొని.వీల్ చైర్ పై కూర్చున్నే రీతిలో సహాయపడటం ఆ సన్నివేశం చూసి చాలామంది జగన్ సీఎం కాదు ప్రజల సేవకుడు అని కొనియాడుతున్నారు.ప్రజా వేదిక కూల్చివేత సమయంలోనే.
తాను ముఖ్యమంత్రి గా ఫీల్ అవ్వటం లేదని… ప్రజలకు సేవకుడిగా మాత్రమే తాను ఈ పదవిలో ఉన్న ట్లు చెప్పటం జరిగింది.జగన్ అప్పుడు చెప్పిన రీతిగా ప్రజలకు సేవకుడిగా పని చేస్తున్నాడని తాజా వీడియో పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు