జగన్ సర్కార్ రైతులకు అదేవిధంగా వినియోగదారులకు మేలు చేకూరే విధంగా జనతా బజార్లు ఏర్పాటు చేయటానికి రెడీ అవుతోంది. ఐదు వేల జనాభా కలిగిన చోట 500 చదరపు అడుగుల విస్తీర్ణం తో జనతా బజార్లు ఏర్పాటు చేయాలని అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు.
అంతే కాకుండా 50 వేల నుంచి రెండు లక్షల జనాభా కలిగిన చోట 5 నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జనతా బజార్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
బయట మార్కెట్ లో కన్నా తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు మీ జనతా బజార్లలో లభించాలని అప్పుడే నిర్దేశించిన ఉద్దేశం నెరవేరినట్లు అవుతుందని సీఎం స్పష్టం చేశారు.
జనతా బజార్లు వలన రైతులకు కనీస మద్దతు ధర మరోవైపు వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు ప్రభుత్వం అందించినట్లు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు.దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జనతా బజార్ లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
.