పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలలో కూడా భారీ స్థాయిలో విజయం సాధించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి భూములకు సంబంధించిన లెటర్ రాయడం ఏపీ లో చర్చనీయాంశంగా మారింది.
మేటర్ లోకి వెళ్తే విజయవాడలో రైల్వే శాఖకు సంబంధించిన అక్రమ భూ బదలాయింపు కి సంబంధించి జగన్ కేంద్ర మంత్రి కి లెటర్ రాశారు.విజయవాడ లోని రాజరాజేశ్వరి పేట లో 800 కుటుంబాలు రైల్వే స్థలాన్ని ఆక్రమించి 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాయి, భూమి క్రమబద్ధీకరణకు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఈ విషయంలో చొరవ తీసుకోవాలని రాష్ట్రానికి బదిలీ చేయాలని లెటర్ లో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను జగన్ కోరారు.