ప్రతి విషయంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ లో నడుస్తున్నట్లుగా కనిపించే ఏపీ సీఎం జగన్ ఇప్పుడు కరోనా ను కట్టడి చేసే విషయంలోనూ, ఇంకా మరికొన్ని విషయాలల్లోనూ కేసిఆర్ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత పెంచుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కూడా కెసిఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఏపీలో అనుసరించాలని చూస్తున్నారు.నిన్ననే మీడియా సమావేశం నిర్వహించిన కేసిఆర్ కరోనా వైరస్ ను కట్టడి చేసే విషయంలో తాము ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని చాలా క్లారిటీ గా చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్న వారి పైన కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అలాగే కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకుంటూ ప్రజల కోసం ఎక్కువగా కష్టపడుతున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది ఇలా అత్యవసర విధులు నిర్వహిస్తున్న వారందరికీ కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే వారికి తగిన ప్రోత్సాహం కూడా ఇస్తున్నట్లుగా మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు .అలాగే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కట్టడి కాకపోయినా, అది పెద్ద విషయం కాదని, త్వరలోనే పూర్తి స్థాయిలో పరిస్థితులను అదుపులోకి తీసుకు వస్తాము అంటూ కేసీఆర్ ప్రకటించడం ప్రజల్లోనూ ధైర్యం నింపుతున్న ట్టు గా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.దీంతో పాటు ఆర్థిక శాఖ పై కూడా జగన్ సమీక్ష చేయబోతున్నారు.రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుండడంతో జగన్ లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని చూస్తున్నారు.
అలాగే తెలంగాణలో కేసిఆర్ ప్రకటించిన విధంగా వైద్య సిబ్బందికి , పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక నగదును ప్రకటించాలని చూస్తున్నారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పైన, తన పైన చేసిన విమర్శలకు కూడా సరైన సమాధానం చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ సమావేశం ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
దీంతో జగన్ ఈ సమావేశం నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఉత్కంఠగా మారింది.