ఏపీలో అసెంబ్లీ ఫలితాలు మరో 24 గంటలలో వచ్చేస్తుంది.ఇక ఈ ఎన్నికలలో గెలుపు పై ఎవరికీ వారు ధీమా గా ఉన్నారు.
ఇక ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం ఈ ఎన్నికలలో ఎలా అయిన గెలుస్తామని చాలా నమ్మక్కంగా ఉంది.దానికి తగ్గట్లుగానే ఎగ్జిట్ పోల్స్ అన్ని వైసీపీ పార్టీనే గెలుస్తుంది అని అంచనాలు వేసాయి.
అయితే వైసీపీ గెలుపు మీద ఎగ్జిట్ పోల్స్ ని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కొట్టిపారేస్తున్నారు.ఇక ఆ పార్టీ నేన్తలు కూడా టీడీపీ గెలుస్తుందని అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిల ఉంటే మరో వైపు ఇంకా ఫలితం రాకముందే వైసీపీ అధినేత సంబరాలకి సిద్ధం అయిపోతున్నట్లు ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే కనిపిస్తుంది.ఇప్పటికే అమరావతికి చేరుకున్న వైసీపీ అధినేత జగన్ తాజాగా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
ఇక రాజన్న పరిపాలన అందించడమే నా సంకల్పం.ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలనే సాగాలి.మండుటెండలో కూడా మార్పు కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న అంటూ పోస్ట్ చేసారు.ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.