ఇటీవల సోమవారం నాడు విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి ఫస్ట్ నుండి పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్కూల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లు వంటి వసతులు లేకపోవడం వల్ల చాలా మంది పిల్లలు స్కూల్ కి రాని పరిస్థితి కూడా ఉందని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి మొదటివారం నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రాష్ట్రంలో అన్ని పాఠశాలలో ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండటంతో విద్యా కానుక టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి సకాలంలో విద్యార్థులకు అందించాలని ఆదేశించారు.
అంతేకాకుండా రాబోయే ఏడాది విద్యాసంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం బోధన పై దృష్టి పెట్టాలని సూచించారు.అదే విధంగా విద్యార్థులు పాఠశాలకు రాకపోతే మొదట వాళ్ల తల్లిదండ్రులకు మెసేజ్ పంపించాలి తరువాత గ్రామ సచివాలయ వాలంటరీ ద్వారా అధికారుల ద్వారా యోగక్షేమాలు తెలుసుకోవాలి దీన్నంతా మోనిటర్ సచివాలయ సిబ్బంది చేయాలని ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులతో జగన్ చర్చించారు.
కచ్చితంగా పిల్లలు స్కూలుకు వచ్చేలా పరిస్థితులు మార్చాలని సీఎం జగన్ ఆదేశించారు.
.