తాజాగా సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది.ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నేపథ్యంలో 9 నుండి 12వ తరగతి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు లాప్ టాప్ లు అందివ్వడానికి జగన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం జరిగింది.
అదే రీతిలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పనులకు సంబంధించిన నిధులు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ 5,990 కోట్లకి బ్యాంకు రుణం హామీ కి ఆమోదం తెలపడం జరిగింది.
అంతమాత్రమే కాకుండా 2008 జేఎన్టీయూ సవరణ చట్టానికి అంగీకారం కూడా ఈ కేబినెట్ సమావేశంలో లభించింది.రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ కొనుగోలు .ఇంకా ఒంగోలు శివారులో యూనివర్సిటీల ఏర్పాటు .2021-2024 ఐటీ విధానానికి ఆమోదం తాజా సమావేశంలో ఏపీ క్యాబినెట్ తెలపడం జరిగింది.అమ్మబడి పథకం ప్రకటించిన టైములో విద్యార్థులకు డబ్బులకు బదులు ల్యాప్టాప్ తీసుకోవచ్చని రెండు ఆప్షన్లు గతంలో సీఎం జగన్ ఇవ్వటం జరిగింది.
ఈ నేపథ్యంలో తాజాగా.అమ్మ ఒడి పథకం లో డబ్బులకు బదులు ల్యాప్టాప్ కావాలనుకునే విద్యార్థులకు.
పంపిణీ చేయటానికి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.