రాజకీయ వైరుద్ధ్యాలు చిత్ర విచిత్రం గా ఉంటాయి.అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థులను ఎన్ని రకాలుగా ఇబ్బందిపెట్టాలో అన్నిరకాలుగా ఇబ్బందులు పెడతారు.
ఆ తరువాత ఆ ప్రత్యర్థులే అధికారంలోకి వస్తే తమను ఇబ్బందిపెట్టిన వారిని అన్నిరకాలుగా ఇబ్బందులు పెడతారు.ఇవన్నీ రొటీన్ గా జరిగేవే.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది.ఇప్పటివరకు తమను అన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టిన టీడీపీ మీద కక్ష తీర్చుకునేందుకు వైసీపీ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
దీనిలో భాగంగానే అక్రమ కట్టడాలపై తీసుకునే చర్యలలో భాగంగా ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న భవనాన్ని ఖాళీ చేయించేందుకు చూస్తున్నారట.
గతంలో అక్రమ కట్టడాలుగా జల వనరుల శాఖ, రెవెన్యూ శాఖలు గుర్తించిన నిర్మాణాలకు ఇప్పుడు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ భవనాలను ఖాళీ చేయించే పనిలో భాగంగానే బాబు నివాసాన్ని ఖాళీ చేయించి కూల్చివేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది.గుంటూరు జిల్లా ఉండవల్లి పరిధిలోని కృష్ణా నది తీరాన గల లింగమనేని ఎస్టేట్లో బాబు ఇప్పటి వరకు తాత్కాలిక నివాసం ఉంటున్నారు.
అక్కడే ప్రజా వేదికను నిర్మించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.పార్టీ కార్యక్రమాలను కూడా ఇక్కడ నుంచే నిర్వహించేవారు.
చంద్రబాబు ఉంటున్న తాత్కాలిక నివాసం కృష్ణాతీరాన అక్రమ కట్టడం అని గతంలో విమర్శలు వచ్చాయి.కృష్ణా రివర్ కన్జర్వెన్సీ చట్టం కింద నదికి 500 మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని నిబంధన ఉంది.గుంటూ రు జిల్లాలో 18, కృష్ణా జిల్లాలో 48 అక్రమ నిర్మాణా లు ఉన్నాయని వాటిని తక్షణమే ఖాళీ చేయాల్సిం దిగా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో నోటీసులు జారీ చేయించారు.కానీ ఆ తరువాత ఆ సంగతే మర్చిపోయారు.
ఎందుకంటే బాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ తో పాటు అనేక ఆధ్యాత్మిక ఆశ్రమాలు, రాజకీయ పార్టీనేతల అతిథి గృహాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం జగన్ అక్రమ కట్టడాలు, నదులు, కాలువల ఆక్రమణలపై సీరియస్ గా దృష్టిపెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుండడంతో మరోసారి ఈ అంశం తెరమీదకు వచ్చింది.