రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్.ఇది ఒకప్పటి మాట.
ఇప్పుడు రోజాకి వైసీపీలో అంత సీన్ లేదని చెప్తున్నారు కొంతమంది వైసిపి లో ఉన్న సీనియర్స్ .రోజా వల్ల పార్టీకి లాభంకంటే కూడా నష్టం ఎక్కువగా ఉంటోందట.అందుకే రోజా ని పక్కన పెట్టేస్తున్నారని తెలుస్తోంది.నంద్యాల సభలో రోజా మాట్లాడిన మాటలకి టిడిపి పార్టీ వాళ్ళకే కాకుండా సామాన్య ప్రజలకి కూడా రోజా మీద వైసీపీ పార్టీ మీద విసుగు పుట్టించాయి.
ఎప్పుడైతే ప్రజలు రోజా ని చీదరించుకుంటున్నారో…అప్పుడే జగన్ రోజాని పక్కన పెడుతూ వచ్చారు
అయితే రోజాని ఎలా తప్పించాలి అని ఎదురు చూస్తున్న జగన్ కి…ఇప్పుడు జగన్ బిగ్ షాక్ ఇవ్వబబోతున్నారట.జగన్ అండ చూసుకోని టీడీపీ నాయకుల మీద…ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోటికి వచ్చినట్టు మాట్లాడే రోజాకు ఊహించని షాక్ ఇస్తున్నారు.
ఇప్పటికే రోజాకి పార్టీలో ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇవ్వకుండా చేస్తున్న జగన్…రోజా సీటుకే ఎసరు పెట్టేసారు అని తెలుస్తోంది
నగరి సీటు ని జగన్ రోజాకి కాకుండా మరొకరికి ఇస్తున్నారని…తెలుస్తోంది.ఈ విషయంలోనే జగన్ వేరొక వ్యక్తికీ జగన్ మాట ఇచ్చేశారట.
ఆ మధ్య జగన్ లండన్ పర్యటనలో భాగంగా ఒక బడా పారిశ్రామిక వేత్తకి నగరి టికెట్ పై హామీ ఇచ్చేశారట.మొన్న గిడ్డి ఈశ్వరి విషయంలో జగన్ ఇలానే చేయడంతో ఆమె టిడిపి లోకి జంప్ అయ్యారు.
మరి జగన్ రాజాని కాదని వేరొకరికి నగరి టికెట్ కట్టబెట్టాలి అనుకోవడం తీవ్రమైన విమర్శలకి దారి తీస్తోంది.మరి జగన్ నిర్ణయం మీద రోజా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.