మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెప్పడంతో పాటు పోకిరి సినిమాతో పోల్చడంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి.
అయితే రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ వస్తుందని అందరూ భావించగా ఈ సినిమాకు భిన్నమైన ఫలితం రావడం గమనార్హం.
అయితే నేను విన్నాను నేను ఉన్నాను డైలాగ్ ఈ సినిమా పాలిట శాపమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ డైలాగ్ వైసీపీకి అనుకూలంగా ఉండే డైలాగ్ కావడంతో వైసీపీ వ్యతిరేక పార్టీలు సర్కారు వారి పాట సినిమాను టార్గెట్ చేశాయి.మహేష్ బాబు సైతం సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా ఏపీ సీఎంకు అనుకూలంగా చేసిన కామెంట్లు సైతం ఈ సినిమాకు మైనస్ అయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మహేష్ బాబు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు.
సర్కారు వారి పాట సినిమాపై వైసీపీ అనుకూల మూవీ అని జరిగిన ప్రచారం సైతం ఈ సినిమాకు డ్యామేజ్ చేసింది.దర్శకుడు ఈ డైలాగ్ పెడతానని చెప్పిన సమయంలో మహేష్ బాబు వద్దని చెప్పి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చే ఛాన్స్ అయితే ఉంది.
మరే పెద్ద సినిమా నుంచి పోటీ లేకపోయినా సర్కారు వారి పాట సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.గత కొన్నేళ్లుగా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న మహేష్ బాబు సినీ కెరీర్ కు సర్కారు వారి పాట స్పీడ్ బ్రేకర్ అనే చెప్పాలి.వరుసగా పెద్ద హీరోల సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తూ ఉండటం గమనార్హం.