చిత్తూరు జిల్లాలో పార్టీని పరుగులు పెట్టించాలని నిర్ణయించుకున్న వైసీపీ అధినేత, సీఎం జగన్.ఈ క్రమంలో చేస్తున్న కార్యక్రమాలు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.చంద్రబాబును అన్ని కోణాల నుంచి వచ్చే ఎన్నికల నాటికి బలహీనుడిని చేయాలనేది జగన్ వ్యూహం.
ఈ క్రమంలోనే ఇప్పుడు పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొంటున్నారు.అదేసమయంలో జిల్లాల్లోనూ టీడీపీని బలహీన పరుస్తున్నారు.
కార్యకర్తలను జోరుగా తనవైపు లాగేసుకుంటున్నారు.ఇక, ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు జగన్ కూడా అమలు చేస్తున్నారు.
ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో పార్టీని పరుగులు పెట్టించడం అనే అజెండా ముందుకు అందుకున్నదే చంద్రబాబు.జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీని విజయం వైపు నడిపించేందుకు ఆయన చేయని పనిలేదు.
వైసీపీ నేతలను తన పార్టీలోకి తీసుకున్నారు.అభివృద్ధి పేరుతో నిధులు కూడా ఇచ్చారు.
పులివెందులకు సాగునీరు ఇస్తానని చెప్పారు.కడప ఉక్కు ఫ్యాక్టరీ.
కేంద్రమే నిర్మించాల్సి ఉన్నప్పటికీ.ఆయనే స్వయంగా శంకుస్థాపన చేశారు.
ఇలా అనేకరూపాల్లో అప్పట్లో చంద్రబాబు ప్రయత్నించినా.చివరకు ఒక్క సీటులోనూ ఆయన విజయం సాధించలేదు.
అయితే, ఇప్పుడు అదే వ్యూహంతో జగన్ ముందుకు సాగుతున్నారు.అయితే, జగన్ వ్యూహానికి దాదాపు అన్నీ ప్లస్లు పడుతుండడం గమనార్హం.
చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత జిల్లా అన్న సంగతి తెలిసిందే.ఇక్కడ గత ఎన్నికల్లో ఒక్క కుప్పం నియోజకవర్గం తప్ప.
ఎంపీ సీటు సహా అన్ని చోట్లా వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది.ఇక, కుప్పంలోనూ పైచేయిసాధిస్తే.
వైసీపీకి ఎదురు ఉండదు.ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట కుప్పాన్ని మినీ మునిసిపాలిటీగా గుర్తించారు.
జగన్ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇచ్చారు.ఇక, ఇప్పుడు ఆయన గ్రేటర్ తిరుపతి అజెండా అందుకున్నారని తెలుస్తోంది.
వచ్చే నాలుగు మాసాల్లో ఇక్కడ ఉప పోరు జరగనుంది.
పైగా ఎప్పటికీ.
తమకే విజయం దక్కాలని.వైసీపీ జెండా రెపరెపలాడాలని భావిస్తున్న జగన్.
వ్యూహాత్మకంగా తిరుపతిని గ్రేటర్గా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.దీంతో మరింతగా అబివృద్ధి చేసేందుకు అవకాశం ఏర్పడడంతోపాటు.
ఇక్కడి ఇళ్ల స్థలాలకు కూడా ధరలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది.
దీంతో వైసీపీ దూకుడు మరింతగా పెరుగుతుందని అంటున్నారు.పైగా జిల్లాలో వైసీపీ నాయకత్వం కూడా చాలా బలంగా ఉండడం జగన్కు పార్టీకి కూడా కలిసి వస్తుండడం గమనార్హం.
మరీ ఈ పరిణామాలను తట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాపై పట్టు ఎలా సాధిస్తారో చూడాలి.