2019 సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇప్పించడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది.ఈ నేపథ్యంలో దాదాపు 24 మంది నాయకులకు ఈ పదవులు కట్టబెట్టడానికి వైసీపీ అధిష్టానం లిస్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
ఇదే టైం లో పార్టీ కోసం పనిచేసి చివరి లో టికెట్లు అందని నాయకులకు న్యాయం చేయడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయినట్లు వీళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మరికొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఏర్పాట్లు చేసుకుంటుంది.
ఈ నేపథ్యంలో దాదాపు 80 కార్పొరేషన్లకి చైర్మన్లు అదే విధంగా డైరెక్టర్లను నియమించడానికి పార్టీ అధిష్టానం ఇటీవల జాబితా రిలీజ్ చేయాలని.భావించగా ఆఖరి నిమిషంలో లిస్ట్ ప్రకటించటం వాయిదా పడింది.గతంలోనే ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో పార్టీ కోసం పనిచేసిన ఏ నాయకుడికి .పార్టీ హైకమాండ్ అన్యాయం చేయాలని హామీ ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం పదవులు వదులుకున్న వారికి టికెట్లు రాని వారికి న్యాయం చేసే దిశగా ఎమ్మెల్సీ పదవులు అదేరీతిలో నామినేటెడ్ పదవులు అప్పగించడానికి వైసిపి రెడీ అయ్యింది.