వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఊహించని షాక్ ఇచ్చాడు వైఎస్ జగన్.పార్టీ కోసం ఎప్పటి నుండో పనిచేస్తున్న ఆమెకు ఇప్పటికే మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తిగా ఉండగా ఆమె బాధపడకూడదని ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు.
అయితే ఇప్పుడు రోజాని ఆ పదవి నుండి తొలగించడం హాట్ న్యూస్ గా మారింది.మంత్రి పదవి రాలేదు ఏపీఐఐసీ చైర్మన్ హోదా అయినా దక్కిందని అనుకుంటున్న రోజాకి ఇప్పుడు ఆ పదవి కూడా దూరమైంది.
ఏపీఐఐసీ చిర్మన్ పదవి నుండి రోజాని తొలగించి ఆ పవదిని మెట్టు గోవర్ధన్ రెడ్డికి అప్పగిస్తూ వైసీ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంపై రోజా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది.జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రోజాతో పాటుగా ఆమె అభిమానులు కూడా షాక్ అయ్యారు.మంత్రి పదవి దక్కలేదు సరికదా ఉన్న పదవి నుండి కూడా తీసేయడం పట్ల రోజా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.
ఇదేకాదు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు వైసీపీ అధిష్టానం సాక్ ఇచ్చింది.కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి ఆయన్ను తొలగించారు.
పదవి నుండి తొలగించబడ్డ రోజా, రాజాలు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.