నందమూరి అభిమానులూ కం తెలుగు దేశం కార్యకర్తలు అయిన కొందరు ఎన్టీఆర్ – బాలకృష్ణల మధ్యన వచ్చిన గ్యాప్ ని తట్టుకోలేక పోతున్నారు వారిద్దరూ ఒకరికి ఒకరు పోటీగా సినిమాలు దించడం ఒకరికి ఒకరు కయ్యంకి కాలు దువ్వడం లాంటివి చెయ్యడం వారికి చాలా ఇబ్బంది కలిగిస్తున్న విషయం.వారిద్దరి మధ్యనా ఇలా జరగడానికి ఏది కారణం అనేది వెతికి మరీ ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డ్ ని తిడుతున్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా పాటలూ, పద్యాలతో వీళ్లు ఈ మొత్తం వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, జగన్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.మా గుండె ఆగినా ఆడినా బాలయ్య కోసమే అని చెప్పే వీరాభిమానులు కొడాలి నాని ని టీడీపీ నుంచి వేరు చేసి తద్వారా ఎన్టీఆర్ నీ బాలకృష్ణ నీ విడగొట్టారు అనేది వారి లాజిక్.
నందమూరి అంతర్గత విబేధాల విషయంలో కూడా వీళ్లు జగన్ ను నిందిస్తుండం వింతగా తోస్తున్నా మరొక పక్క ఇది జగన్ వ్యూహమే అని కానీ ఇంతవరకూ వస్తుంది అని జగన్ అనుకోలేదు అనీ గుడివాడ సీటు కోసం నాని ని దగ్గర చేసుకున్నాడు తప్ప జగన్ ని నారా – నందమూరి ల మధ్య గొడవ పెట్టె ఉద్దేశ్యం లేదు అనీ ,కాని అతను చేసిన పనికి ఇలా జరిగి ఉండే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.