ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో పార్టీల అధినేతలు తమ వ్యాఖ్యలకి తగ్గట్టుగా స్పీడు పెంచుతున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే వైసీపీ, టీడీపీ లపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతుండగా.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ పై ప్రేమని ఒలకబోస్తూ ,జగన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రజలని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.అంతేకాదు పవన్ పొత్తు కోసం పరి తపించి పోతున్నారు.
ఇదిలాఉంటే తన పాదయాత్రతో ఏపీ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ దూసుకెళ్తున్న జగన్ రెడ్డి విషయంలో కోడి కత్తి ఘటన టీడీపీ అధినెతకీ ఎంతటి తలనేప్పులు తెచ్చిపెట్టిందో వేరే చెప్పనక్కర్లేదు.ఈ కేసు ఎన్ఐఏ వరకూ వెళ్ళింది.
దాంతో బాబు పరువు కాస్తా పోయింది అయితే.ఇప్పుడు ఈ విషయంపై జగన్, చంద్రబాబు కి కొన్ని సూటి ప్రశ్నలని సంధించాడు…ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పే దమ్ముందా అనే బాబుకి షాక్ ఇస్తున్నారు వైసీపీ నేతలు.
ఇంతకీ జగన్ సంధించిన ప్రశ్నలు ఏమిటంటే.
నా పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన సమయం నుంచీ ఎయిర్పోర్ట్ లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు.నాపై దాడి చేసిన వ్యక్తిపై గతంలోనే ఓ హత్యాయత్నం కేసు నమోదు అయ్యి ఉంది.అయినా అలాంటి వాడిని ఒక ఎయిర్పోర్ట్ లోకి అనుమతించాలి అంటే పోలీసులు అతడికి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఇదిలాఉంటే ఆ హోటల్ ఒక టీడీపీ నేతది, గతంలో ఆయన టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.అందులో మరో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాత్ర ఉంది.
ఆయన వంగవీటి రంగా హత్య కేసులో ఉన్న వ్యక్తి.ఇలాంటి అంశాలన్నీ ఈ కేసులో ఉన్నప్పుడు, నాపై కత్తి దాడి ఓ అభిమాని చేసిన పని ఎలా అవుతుంది అంటూ జగన్ ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు.
జగన్ లాగిన లాజిక్ కి టీడీపీ అధినేతకి నోట మాట రాలేదు సరికదా ఇప్పటి వరకూ ఈ ప్రశ్నలకి టీడీపీ బ్యాచ్ వివరణ కూడా ఇవ్వలేక పోయాయి.జగన్ పై ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు ఎవరితో ఎవరు చేయించారు అనే విషయాలు భవిష్యత్తులో ఎలాగో తేలుతాయి కాని.ఈ మొత్తం ఎపీసోడ్ లో నష్ట పోయింది, పరువు పోగొట్టుకుంది మాత్రం టీడీపీ పార్టీనే అని చెప్పడం లో మాత్రం సందేహం లేదు అంటున్నారు విశ్లేషకులు.