ఒకవైపు ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా వ్యవహరిస్తున్నారు.ప్రజా సంక్షేమ పథకాలు అమలు, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పనిలో నిత్యం బిజీబిజీగా గడుపుతున్నారు.తనకు, ప్రభుత్వానికి ఎంత ఒత్తిడి ఉన్నా, జగన్ నిరంతరం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు.
ప్రజా సంక్షేమ పథకాలు అమలులో సీఎంగా జగన్ సమర్థవంతంగా సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నా, పార్టీ వ్యవహారాలకు సంబంధించి జగన్ పూర్తిగా దృష్టి పెట్టలేక పోవడంతో, ఎక్కడికక్కడ అసంతృప్తులు పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదంటూ అనేక ఆరోపణలు చేశారు.
వారే కాకుండా ఎక్కడికక్కడ పార్టీని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం నేతల్లో కి వెళ్ళి పోవడం వంటి పరిణామాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా జగన్ కు రిపోర్టు అందడంతో, పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై ఇప్పుడు దృష్టి సారించారు.ముఖ్యంగా పార్టీలో కీలక నాయకులు గా ఉంటున్న , విజయసాయి రెడ్డి , వై వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
.