ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి ఊపందుకుంది.ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ మొదటి జాబితాలో రిలీజ్ చేసి ఈ రోజు రెండో లిస్టు లో మిగలిన అభ్యర్ధులని చంద్రబాబు ప్రకటించడానికి రెడీ అయ్యారు.
మరో వైపు వైసీపీ అధినేత జగన్ కూడా తన అభ్యర్ధులని తాజాగా ఇడుపులపాయలో వైఎస్ సమాధి దర్శనం అనంతరం ప్రకటించారు.నిన్న సాయంత్రం తొమ్మిది మంది ఎంపీ అభ్యర్ధులని ప్రకటించిన జగన్ మిగిలిన ఎంపీ అభ్యర్ధులని ఖరారు చేసారు.
ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ నుంచి మొత్తం అభ్యర్ధులందరిని ఒకే జాబితాలో జగన్ ప్రకటించి మరో సారి చర్చకి అవకాశం లేకుండా చేసారు.ఈ జాబితాలో అందరూ ఊహించి నట్లే బయటకి వచ్చిన అభ్యర్ధులే ఉన్నట్లు తెలుస్తుంది.
అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన వారిలో కొందరికి జగన్ సీట్లు కేటాయించారు.అయితే ఇప్పుడు జగన్ కొత్తగా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన వారికి టికెట్ లు కన్ఫర్మ్ చేయడంతో నియోజకవర్గాలలో వైసీపీ టికెట్స్ ఆశించే వారి నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
అయితే జగన్ ఇవేమీ పరిగణంలోకి తీసుకోకుండా తన ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నారు.