వైసీపీ అభ్యర్ధుల జాబితా ప్రకటన ! మొదటి లిస్టులోనే 175 అభ్యర్ధుల రిలీజ్

ఏపీ రాజకీయాలలో ఎన్నికల వేడి ఊపందుకుంది.ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ మొదటి జాబితాలో రిలీజ్ చేసి ఈ రోజు రెండో లిస్టు లో మిగలిన అభ్యర్ధులని చంద్రబాబు ప్రకటించడానికి రెడీ అయ్యారు.

 Ys Jagan Announce Mla And Mp Candidates List In Idupulapaaya-TeluguStop.com

మరో వైపు వైసీపీ అధినేత జగన్ కూడా తన అభ్యర్ధులని తాజాగా ఇడుపులపాయలో వైఎస్ సమాధి దర్శనం అనంతరం ప్రకటించారు.నిన్న సాయంత్రం తొమ్మిది మంది ఎంపీ అభ్యర్ధులని ప్రకటించిన జగన్ మిగిలిన ఎంపీ అభ్యర్ధులని ఖరారు చేసారు.

ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ నుంచి మొత్తం అభ్యర్ధులందరిని ఒకే జాబితాలో జగన్ ప్రకటించి మరో సారి చర్చకి అవకాశం లేకుండా చేసారు.ఈ జాబితాలో అందరూ ఊహించి నట్లే బయటకి వచ్చిన అభ్యర్ధులే ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన వారిలో కొందరికి జగన్ సీట్లు కేటాయించారు.అయితే ఇప్పుడు జగన్ కొత్తగా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన వారికి టికెట్ లు కన్ఫర్మ్ చేయడంతో నియోజకవర్గాలలో వైసీపీ టికెట్స్ ఆశించే వారి నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

అయితే జగన్ ఇవేమీ పరిగణంలోకి తీసుకోకుండా తన ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube