తెలుగు బుల్లితెర ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం 12 వారాలు పూర్తి చేసుకున్న 13వ వారం లోకి అడుగుపెట్టింది.ఇక 12వ వారం రవి ఎలిమినేట్ కావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు .అయితే ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి షణ్ముఖ్ గురించి ఒక యూట్యూబర్ షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా తను స్పందిస్తూ.షణ్నును ఎక్కడో చూసినట్లుంది… పొద్దున్నే పాల ప్యాకెట్లు, చిత్తు కాగితాలు ఎత్తుకుపోయేది మీరే కదా కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు వాడు కూడా అచ్చం నీలాగే ఉంటారు అంటూ షణ్ముఖ్ గురించి దారుణంగా కామెంట్ చేశారు.
ఇలా ఈ యూట్యూబర్ షణ్ముఖ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ గురించి గత సీజన్ రన్నర్ అఖిల్ సార్థక్ స్పందిస్తూ ఘాటుగా విమర్శలు చేశారు.
ఇప్పటి వరకు మీ పై ఎంతో గౌరవం ఉండేది ఇప్పుడు అది పూర్తిగా పోయింది.
ఒక వ్యక్తి ఈ విధంగా ఎందుకు కించపరుస్తారు.ఈ కార్యక్రమాన్ని ఒక గేమ్ షో గా మాత్రమే చూడండి అంతేకానీ మీకు నచ్చకపోతే ఇలా బాడీ షేవింగ్ చేస్తూ అవమానపరిచవలసిన అవసరం లేదు అంటూ తెలిపారు.చిత్తు కాగితాలు ఏరుకునే వారు మనుషులు కాదా.మీకు నచ్చిన వారిని గెలిపించడంకోసం ఇతరులపట్ల ఇలా దారుణంగా మాట్లాడకూడదు.కేవలం వయసు పెరగడమే కాదు బుద్ధి కూడా పెరగాలి ఆ స్థానంలో మీరు ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది అంటూ అఖిల్ ఘాటుగా స్పందించడంతో ఈ విషయంపై దీప్తి సునైనా స్పందిస్తూ షణ్ముఖ్ కు స్టాండ్ తీసుకున్నందుకు అఖిల్కు థ్యాంక్స్ తెలిపింది.