యూట్యూబ్ తనకు నెలకు రూ.4 లక్షల రూపాయలు ఇస్తోందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.శనివారం నాడు ఢిల్లీ – ముంబై ఎక్స్ ప్రెస్ వే పనుల పురోగతి పై నిర్వహించిన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో యూట్యూబ్ ద్వారా నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను అని తెలిపారు.
ఇంట్లో తాను చెఫ్ గా మారి వంటలు చేశానన ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేశానని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపన్యాసాలు ఇచ్చానని తెలిపారు.ఇప్పటివరకు 950 కి పైగా లెక్చర్లు ఇచ్చానని అన్నారు అలాగే విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు లెక్చర్లు ఇచ్చానని ఆయన అన్నారు.
దీంతో యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల తనకు వ్యూవర్ షిప్ పెరగడంతో ఇప్పుడు యూట్యూబ్ తనకు నెలకు 4 లక్షల రూపాయలు రాయల్టీగా చెల్లిస్తోంది అన్నారు.
దీంతో రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కన్సల్టెంట్ లకు రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ రేటింగ్ ఇవ్వడం ప్రారంభమైందని ఆయన తెలిపారు.
కరోనా సమయంలో చాలా మంది ఉపాధి లేక, ఉన్న ఉద్యోగాలు కోల్పోయి కొంతమంది తినడానికి తిండి లేక జీవనం భారమై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి.
అలాంటి సమయంలో కొంతమంది సోషల్ మీడియా ద్వారా సంపాదించడం ప్రారంభించారు.కాగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి వాటిల్లో వీడియోస్ చేస్తూ చాలామంది సంపాదిస్తున్నారు.అలాగే యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల కూడా చాలా మంది సంపాదిస్తున్నారు.
కరోనా సమయంలో యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం కొంతమంది హాబీగా మార్చుకున్నారు.దీంతో అప్లోడ్ చేయడం వల్ల ద్వారా సంపాదించే అవకాశం వారికి కలిగింది.