ఇటీవల మానవ సంబంధాలు మంటగలుస్తున్న విషయం తెలిసిందే.జీవితంలో డబ్బుకు ఇచ్చిన విలువ కుటుంబానికి గానీ రక్త సంబంధాలకి గానీ ఎలాంటి విలువ ఇవ్వడం లేదు.
కేవలం డబ్బు కోసం తనపర అన్న తేడాలు లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు.ఆస్థి కోసం సొంతవారినే పొట్టనపెట్టుకొని సైకో లుగా తయారు అవుతున్నారు.
ఆస్థి కోసం సొంత పెదనాన్న నే చంపి సెల్ఫీ కూడా దిగాడు ఈ సైకో గాడు.ఈ ఘటన ఉట్నూర్ మండలం లక్కారం గ్రామ పంచాయితీ పరిధిలోని గంగన్న పేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన తాళ్లపల్లి శివరాజ్ ఏఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు.ఐతే కొంతకాలంగా అతడి తమ్ముడు జయరాజ్ ఫ్యామిలీతో ఆస్తి తగాదాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే సోమవారం జయరాజ్ కుమారుడు.తన పెదనాన్న శివరాజ్ను దారుణంగా చంపేసినట్లు తెలుస్తుంది.
చర్చి కి వెళ్తుండగా ఆయనపై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది.
అనంతరం పెదనాన్న మృతదేహం తో సెల్ఫీ కూడా తీసుకున్నాడు నిందితుడు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఒక సైకో లాగా సొంత పెదనాన్న ని హత్య చేసి ఇలా సెల్ఫీ దిగి మరీ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం కలవరం సృష్టిస్తుంది
.