అతిలోక సుందరి తెలుగు అలనాటి తార శ్రీదేవి ఈ లోకాన్ని వదిలి అప్పుడే మూడేళ్లు గడిచాయి.ఇప్పటికీ తనను మర్చిపోకుండా ఎంతోమంది అభిమానులు, సినీ పరిశ్రమలు తన నటన గురించి, తన అందం గురించి గుర్తు చేస్తూనే ఉంటారు.
అంతేకాకుండా తన కుటుంబ సభ్యులు కూడా తన గురించి సోషల్ మీడియాలో కూడా భావోద్వేగాలతో తెలుపుతుంటారు.
ఇదిలా ఉంటే శ్రీదేవి కూతుళ్లు కూడా తన గురించి పలుమార్లు సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూలలో కూడా తెలిపారు.
ఇక శ్రీదేవి 2018లో దుబాయ్ లో బోనికపూర్ మేనల్లుడు మోహిత్ మార్వా పెళ్ళికి హాజరై ఫిబ్రవరి 24న బాత్ టబ్ లో మునిగి మరణించింది.ఇక నిన్నటికి తను చనిపోయి మూడేళ్లు గడవగా బోనీ కపూర్ తన కూతుళ్లతో కలిసి చెన్నైలోని మైలాపూర్ నివాసంలో కొన్ని పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీదేవి మరణించిన కొన్ని రోజుల తర్వాత జాన్వీ కపూర్ తన అమ్మ గురించి భావోద్వేగాలను తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో లో షేర్ చేసింది.తన హృదయంలో తన అమ్మకు పవిత్ర స్థానం ఉందని, ఇకనుండి తను జీవించడం కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుందని, ఈ శూన్య లోకంలో తన అమ్మ తనను ముందుకు నడిపిస్తారని, తను కళ్ళు మూసుకున్న ప్రతిసారి తను చెప్పిన విషయాలు మాత్రమే గుర్తుకు వస్తున్నాయని, తన అమ్మ ఆశీర్వాదాలు ఎప్పటికీ కలిగి ఉండాలని తెలిపింది.అంతేకాకుండా కానీ తన అమ్మ ఈ ప్రపంచం కోసం ఉన్నరంటూ, అందుకే తనని వెనక్కి తీసుకెళ్లారని తన మనసులోని బాధ ను బయటకు తెలిపింది.
ఇదిలా ఉంటే జాన్వీకపూర్ ను శ్రీదేవి తనను నటిగా చూడాలని ఎన్నోసార్లు తెలిపింది.
కానీ ఆ చివరి కోరిక చూడకుండానే లోకాన్ని వదిలింది శ్రీదేవి.ఇప్పుడు శ్రీదేవి కోరిక త్వరలోనే తీరనుంది.
ప్రస్తుతం జాన్వీకపూర్ రూహీ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా గుడ్ లక్ జెర్రీ దోస్తానా 2 లో హీరోయిన్ గా నటిస్తుంది.