రోడ్డు పక్కగా ఫుట్పాత్పై తల్లితో పాటు ఉన్న 9 నెలల బాలుడిని అపహరించింది ఓ 19 ఏళ్ల యువతి.ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలో మాయమైన ఈ చిన్నారిని పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఆ యువతితో సహా కనుగొన్నారు.తరువాత ఆ చిన్నారిని తల్లి దగ్గరకు చేర్చారు.
అయితే ఆ యువతి పిల్లవాడిని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ చిన్నారిని అపహరించింది.
ఈ ఉదంతంలో నిందితురాలిని సప్నా(19)గా పోలీసులు గుర్తించారు.
ఆ యవతితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.ఆ ఇద్దరిలో ఒకరు అజీత్ సింగ్(45).
అజీత్తసింగ్ భార్య మృతి చెందింది.దీంతో ఆ యువతి ఈ చిన్నారితో పాటు అజిత్సింగ్తో కలిసివుండాలని నిర్ణయించుకుంది.
ఆ ఉద్దేశంతోనే పిల్లోడిని అపహరించింది.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూజా అనే మహిళ తన కొడుకు అదృశ్యమయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ నేపధ్యంలోనే పోలీసులు నిందితురాలిని పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పట్టుకున్నారు.