ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి విజృంభణ వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
కరోనా విజృంభణ వల్ల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యేవరకు ఎన్టీఆర్ సెట్స్ కు, హోటల్ కే పరిమితం కానున్నారని సమాచారం.దీంతో ఒక విధంగా తారక్ అజ్ఞాతవాసం గడుపుతున్నారని తెలుస్తోంది.
గతంలో షూటింగ్ ల వల్ల ఎంత బిజీగా ఉన్నప్పటికీ తారక్ షూటింగ్ పూర్తైన వెంటనే ఇంటికి వెళ్లి పిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారు.ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి ఇంటికి తక్కువ దూరమే అయినా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇంటికి వెళ్లడానికి ఎన్టీఆర్ ఇష్టపడటం లేదని సమాచారం.
ఒకరికి వైరస్ సోకినా కుటుంబ సభ్యులంతా కరోనా మహమ్మారి బారిన పడే అవకాశం ఉండటంతో రిస్క్ తీసుకోవడానికి తారక్ ఇష్టపడటం లేదట.
తారక్ సెట్స్ లో, హోటల్ రూంలోనే గడుపుతున్నాడని ఖాళీ సమయంలో కూడా బయటకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.అయితే ఇంటికి వెళ్లకపోయినా ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ ఉంటూ వాళ్ల క్షేమ సమాచారాన్ని తారక్ తెలుసుకుంటున్నాడని సమాచారం.పూర్తిగా ఇంటి ధ్యాసే వదిలేసిన తారక్ డెడికేషన్ ను చూసి యూనిట్ సభ్యులు సైతం అవాక్కవుతున్నారట.
మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సైతం సెట్స్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే రెండుసార్లు సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిన నేపథ్యంలో షూటింగ్ పూర్తైన తరువాతే రిలీజ్ డేట్ ను ప్రకటించాలని రాజమౌళి భావిస్తున్నాడని సమాచారం.2021 సమ్మర్ లేదా దసరా పండుగ సమయంలో సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.