సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి ఎన్నో వార్తలు గతంలో ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఆహారపు అలవాట్ల గురించి సైతం అభిమానులకు తెలిసినా పూర్తిస్థాయిలో అన్ని విషయాలు అయితే తెలియవు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తన ఆహారపు అలవాట్లు( Food Habits ) ఏ విధంగా ఉంటాయో వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
నాకు తాతయ్యగారి నుంచి ఫుడ్ విషయంలో పిచ్చి పట్టుకుందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
మొదట నేను ఎక్కువగా తినేవాడిని కాదని మా అమ్మ నాకు ముద్దలు కలిపి పెట్టేదని రెండు ముద్దలు తినగానే నాకు వాంతి వచ్చేదని తారక్ పేర్కొన్నారు.అలా జరగడం వల్ల నేను ఎక్కువగా తినేవాడిని కాదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెల్లడించారు.
తాతయ్యగారు ఇడ్లీని నేతిలో ముంచి తినమని పెట్టేవారని తారక్ తెలిపారు.
అక్కడినుంచి నాకు బాగా తిండిపిచ్చి పట్టేసిందని ఆయన కామెంట్లు చేశారు.అప్పటినుంచి నేను బాగా పుష్టిగా తినేవాడినని తారక్ పేర్కొన్నారు.హైదరాబాద్ లో బావర్చి బాగా ఫేమస్ అని అక్కడ ఫ్యామిలీ ప్యాక్( Family Pack Biryni ) ఇస్తారని ఆ ఫ్యామిలీ ప్యాక్ నలుగురికి సరిపోతుందని నేను ఒక్కడిని ఒకే ఒక్క సిట్టింగ్ లో తినేవాడినని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.తారక్ ఆహారపు అలవాట్లు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు.దేవర సినిమా కోసం తారక్ తెగ కష్టపడుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
తారక్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.