ఎవరు మీలో కోటిశ్వరుడుకు బై బై చెప్పేసిన ఎన్టీఆర్.. త్వరలోనే ముగియనున్న షో?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.వెండితెర పై అలరించడం తో పాటుగా బుల్లితెరపై కూడా అతని వాహ నీ చూపిస్తున్నాడు.

 Evaru Meelo Kotiswarulu, Jr Ntr, Tollywood, Ram Charan,latest Tollywood News-TeluguStop.com

ఈ ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఇప్పటికే పలువురు సెలబ్రిటీల తో పాటుగా సామాన్య వ్యక్తులు కూడా వచ్చారు.ఇక ఈ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ వచ్చారు.

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్ 1కు సంబంధించి చిత్రీకరణను ఎన్టీఆర్ పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మొదటి రోజే ఎన్టీఆర్ తన స్నేహితుడు రామ్ చరణ్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు.

ఆ తర్వాత రాజమౌళి, కొరటాల శివ, సమంత లాంటి స్టార్స్ తో సందడి చేశారు.ఇక త్వరలోనే ఈ షో కి సూపర్ స్టార్ మహేష్ బాబు, మిల్కీ బ్యూటీ తమన్నా రాబోతున్నట్లు సమాచారం.మొత్తం ఈ షో 60 ఎపిసోడ్స్ కోసం ఎన్టీఆర్ 7.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Evarumeelo, Jr Ntr, Ram Charan, Tollywood-Movie

ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్సినిమాలు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిద్ధమవుతున్నారు.ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు.పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు అలాగే చిత్రబృందం భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగానే రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube