సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభాస్ డైరెక్టర్.. రెండు పార్ట్ లుగా ప్రాజెక్ట్ కే సినిమా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Young Rebel Star Prabhas Nag Ashwin Project K To Release In Two Parts,prabhas,n-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, ఆది పురుష్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Telugu Salaar, Adipurush, Amitab Bachchan, Disha Patani, Nag Ashwin, Pan India,

దీంతో ప్రభాస్ అభిమానులు తదుపరి సినిమా ఆది పురుష్ పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.కానీ గత ఏడాది విడుదలైన ఈ సినిమా టీజర్ ఊహించని విధంగా పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.ఇకపోతే డార్లింగ్ అభిమానులు ప్రస్తుతం అంచనాలు అన్నీ కూడా సలార్ సినిమాపై పెట్టుకున్నారు.సలార్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Telugu Salaar, Adipurush, Amitab Bachchan, Disha Patani, Nag Ashwin, Pan India,

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ప్రాజెక్ట్ కే సంబంధించి ఒక ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేమిటంటే ప్రాజెక్ట్ కే సినిమా పార్ట్ 2 పార్ట్ 1 లాగా రెండు పార్ట్ లాగా తీసుకురాబోతున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.కథ పరిధి చాలా పెద్దగా ఉండటంతో ఒకే సినిమాలో ఇమడ్చడం కష్టంగా ఉందని, అందుకే రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.కాగా బాహుబలి సినిమా మాదిరే ప్రాజెక్ట్ కే సినిమా కూడా భారీగా అంచనాలను క్రియేట్ చేస్తుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Salaar, Adipurush, Amitab Bachchan, Disha Patani, Nag Ashwin, Pan India,

కాగా ఇప్పటికే పార్ట్ వన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు కూడా తెలుస్తోంది.పార్ట్ వన్ ఇప్పుడు కాకుండా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కే సినిమాలొ ప్రభాస్‌కి సరసన దీపికా పదుకొనె, దిశా పటానీ నటిస్తున్నారు.అలాగే ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ కూడా కీలక పాత్ర నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube