ఆయన యువ ఎంపీ.సినీ ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి అనూహ్యంగా అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు.
అయితే, ఏడాదిన్నరలోనే కొంచెం విమర్శలు, మరికొంచెం.ప్రశంసలు దక్కించుకుంటున్నారు.
వైసీపీ ఎంపీల్లో డిఫరెంట్ వైఖరితో ముందుకు సాగుతున్న యువ ఎంపీపై పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి మార్గాని భరత్ రామ్ విజయం సాధించారు.
దేవుని పట్ల భక్తి, పెద్దలంటే గౌరవం మెండుగా ఉన్న ఆయన నిత్యం పూజలు చేయనిదే బయటకు రారనే పేరుంది.అయితే, ఆయన వ్యవహార శైలిలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని నియోజకవర్గంలోని నాయకులు పేర్కొనడం గమనార్హం.
స్థానికంగా నేతలను కలుపుకొని పోవాల్సిన ఎంపీ భరత్.ఎవరినీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి.అయితే, వీటిని కొట్టిపారేసిన ఆయన తర్వాత కొన్నాళ్లు అందరితోనూ బాగానే కలివిడిగా తిరిగారు.ఇంతలోనే ఇసుక ఆరోపణలు, సొంత పార్టీ నేతతో వివాదాలు వంటివి ఆయనను చుట్టుముట్టాయి.
దీంతో కొన్నాళ్లు మౌనం పాటించారు.ఇక, తాజాగా కరోనా అనంతరం .మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు.అయితే, ఇప్పుడు కూడా ఆయన ప్రొటోకాల్ పాటించడం లేదని, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
అంతేకాదు, సీఎం జగన్ దృష్టిలో పడేందుకు, జాతీయ స్థాయి రాజకీయాల్లో వెలిగేందుకు ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా.తన కనుసన్నల్లోనే జరగడం, తను చెప్పిన వారికే పిలుపు అందడం వంటివి పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.అదే సమయంలో ఆయా కార్యక్రమాల్లో ఏర్పాటు చేస్తున్న ఫెక్సీలకు “భరత్ అనే నేను“ అనే టైటిల్తో హంగామా చేస్తున్నారని, మిగిలిన నాయకుల బొమ్మలు వేయడం లేదన్నది స్థానిక నేతల విమర్శ.
అంతేకాదు, ఆయనతో నిన్న మొన్నటి వరకు అనేకకార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఒకరు ఇప్పుడు ఆయనకు డిస్టెన్స్ మెయింటెన్ చేయడంపైనా.చర్చ నడుస్తోంది.
అయితే.అవినీతి లేకపోవడం, పార్టీకి, సీఎం జగన్కు విధేయుడిగా ఉండడం, రేపటి గురించిన ఆలోచన ఉండడం వంటివి ఎంపీ భరత్కు మంచి మార్కులు వేసేలా చేస్తున్నాయని అంటున్నారు.
యువ ఎంపీ దూకుడుతో వైసీపీలో హుషారే.కానీ.
అందరినీ కలుపుకొని పోవాలి కదా! అనే సూచనలు వస్తున్నాయి.మరి ఏం చేస్తారో చూడాలి.