ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి చాలా దగ్గరైన నేస్తం టెక్నాలజీ అని చెప్పవచ్చూ.ఈ టెక్నాలజీతో రోజుకు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి.
ఎందరో అమాయకులు దీని బారినపడి తల్లడిల్లుతున్నారు.అరచేతిలో ప్రపంచాన్ని చూపుతూ, మన నిత్యజీవితంలో భాగమైన టెక్నాలజీ మనిషిని శాసిస్తుందని చెప్పవచ్చూ.
దీనికి బానిసలైతే బ్రతుకు గుదిబండలా మారుతుంది.ఇకపోతే ఎనిమిదో తరగతి వరకు చదివిన ఓ యువకుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి 400 మంది అమ్మాయిల సోషల్ మీడియా ఖాతాల్ని హ్యాక్ చేశాడట.
ఆ వివరాలు చూస్తే.
యూపీకి చెందిన 26 ఏళ్ల వినీత్ మిశ్రా ఎనిమిదో తరగతి చదువును మధ్యలోనే ఆపేశాడు.కానీ య్యూటూబ్ ద్వారా అమ్మాయిలను ఎలా బ్లాక్ మెయిల్ చేయాలో నేర్చుకున్నాడట.ఆ తర్వాత అతను అమ్మాయిలకు కొన్ని లింక్ లను వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల ద్వారా పంపిస్తాడట.
ఏ అమ్మాయిలైతే ఆ లింక్ లు ఓపెన్ చేసి, వారి ఈ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ డిటైల్స్ ఎంటర్ చేస్తుందో వారి పని ఇక అంతేనట.
అలా వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా పర్సనల్ డేటా, ఛాటింగ్ డేటాను డౌన్ లోడ్ చేసుకుని వాటితో బ్లాక్ మెయిలింగ్ కు దిగేవాడట.
ఇక ఇతని ఆగడాలు భరించలేని ఒకమ్మాయి ఫిర్యాదు ఇవ్వడంతో వెలుగులోకి వచ్చాయట.ఇలా బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు వినీత్ మిశ్రా ను అరెస్ట్ చేసి, అతని ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారట.